మీర్పూర్లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళల జట్టు (Indian Women Team) రాణించింది. మొదటగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు( Bangladesh Women Team) బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ (Harmanpreet) బృందం ఫీల్డింగ్ తీసుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్కు శుభారంభం లభించకపోగా.. బంగ్లాను తక్కువ స్కోరుకే భారత్ కట్టడి చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఫర్గానా హోక్(105) సెంచరీతో ఆకట్టుకోగా.. షమీమా సుల్తానా (56), శోభన మోస్తరీ (23) రాణించారు. ఇక భారత బౌలర్లలో స్నేహ రానా రెండు వికెట్లు తీయగా.. దేవికా వైద్య ఒక వికెట్ పడగొట్టింది. ఇక గత మ్యాచ్లో బంగ్లాపై టీమ్ఇండియా పైచేయి కాగా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.
Innings Break!
Bangladesh post 225/4 in the first innings.#TeamIndia need 226 to win the 3rd ODI as well as the series 💪
Live Stream 📺 – https://t.co/lqRXIECtlj
Scorecard – https://t.co/GNp3lOF8JP #BANvIND pic.twitter.com/c8oFoJ2KKe
— BCCI Women (@BCCIWomen) July 22, 2023