ఢాకా : బంగ్లాదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన శనివారం కొనసాగనుంది. నైరుతి షాట్ఖిరా, గోపాల్గంజ్లోని జశోరేశ్వరి, ఓర్కాండి దేవాలయాల్లో పూజలు చేయనున్నారు. భారత్తో పాటు పక్కనే ఉన్న దేశాల్లోని 51 శక్తిపీఠాన్ని జశోరేశ్వరి కాళీ ఆలయాన్ని సందర్శించనున్నారు. అలాగే గోపాల్గంజ్ జిల్లాలోని తుంగిపారలోని షేక్ ముజిబుర్ రెహ్మాన్ సమాధిని సందర్శించి, నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో సమావేశం కానున్నారు. ఇరుదేశాల సంబంధాలపై చర్చలు జరుపడంతో పాటు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఐదు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్తో సమావేశం కానున్నారు.