ముంబై: టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మిడిలార్డర్లో మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ దంచి కొట్టడంతో ఐపీఎల్-15వ సీజన్లో బెంగళూరు నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కార్తీక్ (34 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా.. షాబాజ్ అహ్మద్ (32 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. డుప్లెసిస్ (8), కోహ్లీ (12), అనూజ్ రావత్ (0), ప్రభుదేశాయ్ (6) విఫలం కాగా.. కార్తీక్, షాబాజ్ ఆరో వికెట్కు 52 బంతుల్లో 97 పరుగులు జోడించారు. ముఖ్యంగా కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముస్తఫిజుర్ వేసిన 18వ ఓవర్లో కార్తీక్ 4,4,4,6,6,4తో అదరగొట్టాడు. అనంతరం ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ రిషబ్ పంత్ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపినా.. మిగిలిన వాళ్లు విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు. బెంగళూరు బౌలర్లో హజిల్వుడ్ 3, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. కార్తీక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా ఆదివారం జరుగనున్న డబుల్ హెడర్లో పంజాబ్తో హైదరాబాద్, గుజరాత్తో చెన్నై తలపడనున్నాయి.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 189/5 (కార్తీక్ 66*, మ్యాక్స్వెల్ 55; శార్దూల్ 1/27), ఢిల్లీ: 20 ఓవర్లలో 173/7 (వార్నర్ 66, పంత్ 34; హజిల్వుడ్ 3/28, సిరాజ్ 2/31).