బెంగళూరు: స్టార్ రైడర్ పవన్ షెరావత్ విశ్వరూపం కనబర్చడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో బెంగళూరు బుల్స్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు 42-28తో హర్యానా స్టీలర్స్ను చిత్తు చేసింది. తాజా సీజన్ తొలి మ్యాచ్లో ఓటమి పాలైన బెంగళూరు.. ఆ తర్వాత వరుసగా మూడో విజయం నమోదు చేసుకొని 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. బెంగళూరు కెప్టెన్ పవన్ 22 పాయింట్లతో వన్మ్యాన్ షో కనబర్చగా.. హర్యానా స్టీలర్స్ తరఫున వికాస్ (7), రోహిత్ (5) రాణించారు. మరో మ్యాచ్లో యూ ముంబా 37-28తో జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం సాధించింది.