Mobile Phones | న్యూఢిల్లీ: విద్యార్థుల ప్రవర్తన, శ్రద్ధను మెరుగుపరిచేందుకు పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. క్లాస్ రూములలో అంతరాయాలను తగ్గించడంతోపాటు విద్యార్థుల ప్రవర్తనను మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పాఠశాలలు పిల్లలు నేర్చుకునే ప్రదేశాలని, మొబైల్ ఫోన్లు తరగతి గదిలో అవాంఛనీయమైన పరధ్యానాన్ని కలిగిస్తాయని బ్రిటన్ విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్ పేర్కొన్నారు. బ్రేక్, లంచ్ సమయంలో కూడా మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులు నిర్బంధం ఎదుర్కోవాల్సి వస్తుంది.