కలకత్తా హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, నవంబర్ 1: పశ్చిమ బెంగాల్లో కాళీ పూజ, దీపావళి, ఇతర పండుగల్లో పటాకుల వినియోగంపై సంపూర్ణ నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. సుప్రీం కోర్టు అనుమతించిన పటాకులను కాల్చడానికి అనుమతినిచ్చింది. గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. నిషేధిత పటాకులు, ముడి సరుకు రాష్ట్రంలోకి దిగుమతి కాకుండా చూసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్ సమయంలో వాయు కాలుష్యాన్ని పరీక్షించేందుకు ఈ ఏడాది పండుగల్లో ఎలాంటి పటాకులు కాల్చవద్దని కలకత్తా హైకోర్టు అక్టోబర్ 29న తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.