సహజ పండితుడు, మహాకవి బమ్మెర పోతన ఘనత భావితరాలకు తెలిసేలా చారిత్రక నగరం వరంగల్లో ప్రభుత్వం డిజిటల్ మ్యూజియంను ఏర్పాటు చేసింది. పోతన తాళపత్ర గ్రంథాలను ఆధునిక సాంకేతికతతో డిజిటలైజ్ చేశారు. సరళ గంభీరమైన భాగవత పద్యాలను భావ యుక్తంగా డిజిటల్ తెరలపై చదువుకోవచ్చు. మ్యూజియంలో అడుగుపెట్టగానే ఎల్యీడీ స్క్రీన్పై పోతనామాత్యుని రచనల వివరాలు ప్రత్యక్షం అవుతాయి. కొనవేలితో తాకితే చాలు.. నచ్చిన పద్యాన్ని తాత్పర్య సహితంగా తెరమీద చూడవచ్చు. పోతన జీవిత విశేషాలను తెలిపే వీడియోలనూ వీక్షించవచ్చు. మొత్తం నాలుగు పెద్ద తెరలపై జీవిత చరిత్ర, కుటుంబ నేపథ్యం, సాహిత్యం.. తదితర అంశాలు ప్రదర్శితం అవుతూ ఉంటాయి. ‘సత్కవుల్ హాలికులైన నేమి..’ అంటూ సేద్యానికి, అక్షర సేద్యానికి సమన్యాయం చేసిన పోతన జీవిత ఘట్టాలను తలపించేలా మ్యూజియం ఆవరణలో ఎడ్ల బండిని ఏర్పాటు చేస్తున్నారు. ముందు భాగంలో నిర్మించిన తామరల కొలను ప్రత్యేక ఆకర్షణ. రాష్ట్ర ప్రభుత్వం, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధం చేసిన ఈ డిజిటల్ మ్యూజియం ఇటీవలే ప్రారంభమైంది. తప్పక సందర్శించండి.
…?పిన్నింటి గోపాల్
గొట్టె వెంకన్న