సోనామార్గ్: అమర్నాథ్ యాత్రికుల కోసం బాల్తాల్ బేస్ క్యాంపు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమర్నాథ్ యాత్ర రేపటి నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్లోని సోనామార్గ్లోని బల్తాల్ వద్ద యాత్రికుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రికుల కోసం ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేయదు. కానీ లంగర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి రోజు సుమారు 1.5 లక్షల మందికి ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. భోజనాల కోసం 38 లంగర్ సంస్థలకు అనుమతి ఇచ్చినట్లు క్యాంప్ డైరెక్టర్ ఎన్ఎస్ జమ్మాల్ తెలిపారు.