కరాచీ: పాకిస్థాన్ బాబర్ ఆజమ్ తన టాప్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్లో అతను 66 బంతుల్లో 110 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో టీ20ల్లో రెండవ సారి సెంచరీ చేసిన పాకిస్థాన్ క్రికెటర్గా బాబర్ నిలిచాడు. ఇక రెండవ టీ20లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. పాక్ విక్టరీతో ఏడు మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. మొయిన్ అలీ 23 బంతుల్లో 55 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. బెన్ డక్కెట్ శరవేగంగా 43 రన్స్ చేశాడు. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఓపెనర్లు బాబర్, రిజ్వాన్లు దంచికొట్టాడు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా పాకిస్థాన్ ఆ టార్గెట్ను అందుకున్నది. రిజ్వాన్ 88 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. టీ20ల్లో అత్యధిక స్కోర్ను వికెట్ నష్టపోకుండా ఛేజ్ చేసిన జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. ఇవాళ రెండు జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ జరగనున్నది.