యాచారం, డిసెంబర్ 12 : మండల కేంద్రంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని గురుస్వామి చంద్రమోహన్నాయర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. మల్కీజ్గూడ గ్రామానికి చెందిన అనంతరెడ్డి నిర్వహించిన పడిపూజకు అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామిని స్మరిస్తూ భజన కీర్తనలతో పాటలు పాడారు. 18 పడిమెట్లకు పూజలు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కడ్తాల్లో..
కడ్తాల్ : మండల కేంద్రంలో ఆదివారం అయ్యప్పస్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. మండలంలోని గురుస్వాముల ఆధ్వర్యంలో మహేశ్గౌడ్ నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలీ శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ సుభాశ్, భీముడునాయక్, భిక్కూనాయక్, విజయ్గౌడ్, మోత్యానాయక్, అశోక్రెడ్డి, శ్రీకాంత్, వివిధ మండలాల అయ్యప్పస్వాములు, భక్తులు పాల్గొన్నారు.