తిరుమల: టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని దుకాణాల నిర్వాహకులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.గ్యాస్ సిలిండర్ల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఆ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను టిటిడి విజిలెన్స్ అధికారులతోపాటు ఫైర్ సిబ్బంది వివరించారు.
అన్ని దుకాణాలు, హోటళ్లలో అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వీజీవో బాలిరెడ్డి, ఎవిఎస్వోలు సాయి గిరిధర్, శివయ్య, వీఐలు రమణారెడ్డి, దామోదర్, ఫైర్ సిబ్బంది రాజయ్య, దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.