బడంగ్పేట, నవంబర్25: బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్కు స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో అవార్డు వరించింది. భారత ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ కాగా రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా దేశంలో మొత్తం 4320 పట్టణాలు పాల్గొన్నాయి. బడంగ్పేటలో 10,0000 వరకు ఉన్న జనాభా ప్రాతిపదికన సర్వే నిర్వహించారు. దక్షణాది రాషాల్లో 199 మున్సిపాలిటీలు పాల్గొన్నాయి.
(పేరక్ దౌర్) అవార్డుకు బడంగ్పేట కార్పొరేషన్ ఎంపికైంది. సిల్వర్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదగా త్వరలో అందుకోనున్నారు. జాతీయ స్థాయిలో కార్పొరేషన్కు అవార్డుకు ఎంపిక కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహించిన కార్యక్రమాలు
చెత్త రహిత బడంగ్పేట కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికి అధికారులు, పాలక వర్గ సభ్యులు, సిబ్బంది, ప్రజల భాగస్వామ్యంతో అవార్డు సాధించారు. పారిశుధ్యం లోపించకుండా ప్రతి ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరణ చేయ డం, ఇంటి ఆవరణలో ఎరువులను తయారు చేయించా రు. వర్కర్స్ సేప్టీ, పారిశుధ్యంపై అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్పై ర్యాలీలు, కరపత్రాల ప్రచారం చేశారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేయించారు.డివిజన్ల వారీగా పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.ప్లాస్టిక్ కవర్లు వాడకంపై నిషేధం విధించారు. ప్రతి కాలనీలో స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రజలను భాగస్వాములు చేశారు.
అవార్డుకు ఎంపిక కావడం సంతోషం
బడంగ్పేట కార్పొరేషన్ జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక కావడం సంతోషం. తన నియోజక వర్గంలో ఉన్న కార్పొరేషన్కు జాతీయ స్థాయి లో స్వచ్ఛ సర్వేక్షణ్లో 4వ ర్యాంక్ రావడం గర్వ కారణం. పాలక వర్గ సభ్యులు, అధికారులు, కార్మికులు అందరు సమన్వయంతో పనిచేశారు. అందరు చొరవతోనే ఈ అవార్డు వచ్చింది.
అందరి కృషి ఫలితం
బడంగ్పేట కార్పొరేషన్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం అందరి కృషి ఫలితం. పారిశుధ్య సిబ్బంది అలుపెరుగకుండా పనిచేశారు.నగర దీపికలను ఎంపిక చేశాం. మంచి ఫలితాలు వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ్పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్స్ పూర్తి స్థాయిలో సహకరించారు. అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది.