న్యూఢిల్లీ: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ తొలి రోజు భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే స్టీఫుల్ఛేజ్ ఈవెంట్ ఫైనల్లోకి ప్రవేశించాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఈవెంట్లో ఫైనల్కు అవినాశ్ అర్హత సాధించడం ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్ ఈవెంట్ను హీట్స్లో 8:18.75 నిమిషాల్లో పూర్తి చేశాడు. హీట్స్లో ఏడో స్థానంలో నిలిచాడు అవినాశ్. ఇవాళ జరిగిన లాంగ్ జంప్ ఈవెంట్లో శ్రీశంకర్ కూడా ఫైనల్కు అర్హత సాధించాడు. ఇక షాట్పుట్లో తేజిందర్ పాల్ సింగ్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. సింగిల్ త్రో కూడా వేయకుండా రిటైర్ అయ్యాడు. 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్లో సందీప్ కుమార్ 40వ స్థానంలో నిలిచాడు. అతను 1:31:58. తన పరుగును పూర్తి చేశాడు. అతని బెస్ట్ 1:20:16. గంటలు. కానీ ఆ రికార్డును కూడా అందుకోలేకపోయాడు. 20 కిలోమీటర్ల మహిళ రేజ్ వాకింగ్లో ప్రియాంకా గోస్వామి 34వ స్థానంలో నిలిచింది. ఆమె 1:39:42 గంటల్లో తన ఈవెంట్ను పూర్తి చేసింది.