కరాచీ: సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు పరుగుల పండగ చేసుకుంటుంది. జీవం లేని పిచ్లపై బ్యాటర్లు దంచికొడుతున్నారు. ఇరు జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా.. కరాచీలో జరుగుతున్న రెండో టెస్టు కూడా నిస్సారంగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 505 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (160) భారీ సెంచరీతో కదంతొక్కగా.. వికెట్ కీపర్ అలెక్స్ కారీ (93; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో ఫహీమ్, సాజిద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.