సిడ్నీ: ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఒత్తిడిని జయించిన ఆస్ట్రేలియాను విజయం వరించింది. సూపర్ ఓవర్లో ఫలితం తేలిన రెండో టీ20లో తుదికంటా పోరాడిన శ్రీలంక చివరకు ఓటమి వైపు నిలిచింది. ఆదివారం జరిగిన పోరులో తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన లంక ఓ వికెట్ కోల్పోయి 5 పరుగులు చేయగా.. ఛేదనలో స్టొయినిస్ రెండు ఫోర్లు బాదడంతో ఆసీస్ మూడు బంతులు మిగిలుండగానే మ్యాచ్ను కైవసం చేసుకుంది. అసలు పోరులో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో లంక 20 ఓవర్లలో సరిగ్గా 8 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది.