బెంగళూరు, ఏప్రిల్ 10: కర్ణాటకలో ధార్వాడ్ పట్టణంలోని హనుమాన్ ఆలయం బయట ముస్లిం చిరువ్యాపారులపై దాడి జరిగింది. శ్రీరామసేన హిందూత్వ సంస్థకి చెందిన వారిగా చెబుతున్న కొంత మంది వ్యక్తులు వ్యాపారులు అమ్ముకునే పండ్లను చెల్లాచెదురుగా పడేయడం, రోడ్డుపై పగులకొట్టడం చేశారు. అదేవిధంగా తోపుడు బండ్లను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించాలని ఇటీవల పలు హిందూత్వ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా ఘటన జరగడం గమనార్హం.