గౌహతి: అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోవిడ్-19 ఆంక్షలను ఎత్తివేసింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎటువంటి ఆంక్షలు ఉండవని సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. కర్ఫ్యూను ఎత్తివేస్తున్నామని, ఇక నుంచి సాధారణ జీవన పరిస్థితులు ఉంటాయని ఆయన చెప్పారు. గడిచిన రెండు వారాల నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ఆయన తెలిపారు. అయితే మాస్క్లు, శానిటైజర్లను మాత్రం తప్పనిసరి చేయనున్నారు. నైట్ కర్ఫ్యూను ఇక విధించబోమన్నారు. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లను పూర్తి కెపాసిటీతో తెరవనున్నారు. డబుల్ వ్యాక్సిన్ తీసుకుని ఉంటే, పెండ్లిళ్లకు కూడా ఆంక్షలను ఎత్తివేయవచ్చు అన్నారు. స్కూల్ ఎగ్జామ్స్తో పాటు మజౌలీ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.