న్యూఢిల్లీ: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇండియాలో పర్యటిస్తుండగా..ఆయన మాత్రం బంగ్లాదేశ్ ఏకీకరణ గురించి కామెంట్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను స్టార్ట్ చేసిన నేపథ్యంలో దానిపై రియాక్ట్ అవుతూ.. భారత్ జోడో అవసరం లేదని, అఖండ భారత్ కావాలని ఆకాంక్షించారు. భారత్ ఐక్యంగానే ఉందని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సిల్చార్ నుంచి సౌరాష్ట్ర వరకు మనం అంతా ఒక్కటే అని, ఈ దేశాన్ని భారత్, పాకిస్థాన్గా విభజించింది కాంగ్రెస్ పార్టీ అని అస్సాం సీఎం ఆరోపించారు. బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసింది కూడా ఆ పార్టీయే అని ఆయన అన్నారు. తన తాత నెహ్రూ తప్పు చేసినట్లు రాహుల్ భావిస్తే, దానికి భారత్ జోడో అని యాత్రను చేపట్టడం అవసరమని సీఎం హిమంత అన్నారు. కావాలంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్తో కలిపి అఖండ భారత్ను ఏర్పాటు చేయాలని రాహుల్కు హిమంత సూచించారు.
#WATCH | "India is intact. We're one nation. Congress disintegrated India in 1947. If Rahul Gandhi has any regret that his grandfather made a mistake, there's no use of Bharat Jodo Yatra in India. Try to integrate Pakistan, Bangladesh & work for Akhand Bharat..," says Assam CM. pic.twitter.com/W1ZbWV4rOG
— ANI (@ANI) September 7, 2022