న్యూఢిల్లీ: ఆసియా కప్ హాకీ టోర్నీలో సీనియర్ డ్రాగ్ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. జకర్తా వేదికగా ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి హాకీ ఇండియా (హెచ్ఐ) సోమవారం జట్టును ప్రకటించింది. 20 మందితో కూడిన జట్టుకు రూపిందర్ సారథ్యం వహించనుండగా.. బిరేంద్ర లక్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. పూల్ ఏలో జపాన్, పాకిస్థాన్, ఇండోనేషియాతో కలిసి భారత్ ఉండగా.. పూల్ బీలో మలేషియా, కొరియా, ఒమన్, బంగ్లాదేశ్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ టోర్నీకి సీనియర్ ప్లేయర్లు మన్ప్రీత్సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేశ్కు విశ్రాంతి కల్పించగా.. జూనియర్ ప్రపంచకప్లో భాగమైన ప్లేయర్లకు జట్టులో చోటు దక్కింది. కాగా.. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన అనంతరం ఆటకు వీడ్కోలు పలికిన రూపిందర్, బిరేంద్ర లక్రాతోపాటు మరో సీనియర్ ప్లేయర్ ఎస్వీ సునీల్కు హాకీ ఇండియా తిరిగి ఆహ్వానం పలుకడం గమనార్హం.