హైదరాబాద్: కమర్షియల్ వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన అశోక్ లేలాండ్.. మార్కెట్లోకి శక్తివంతమైన టిప్పర్ను విడుదల చేసింది. అవతార్ పేరుతో విడుదల చేసిన ఈ ట్రక్కులు రెండు రకాల్లో లభించనున్నాయి. అవతార్ 2832, అవతార్ 3532 లభించనున్న ఈ ట్రక్కులకు రూ.58 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్యలో ధరను నిర్ణయించింది. 8.0 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ ట్రక్కులను కేవలం మైనింగ్ సరఫరా కోసం రూపొందించింది.