నారాయణపేట, మే 9: నారాయణపేటలో మహిళా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులను ఆరుణ్య బ్రాండ్ పేరిట అమ్ముతున్న విషయం తెలిసిందే. అయితే వీటికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించేందుకు జిల్లా కలెక్టర్ హరిచందన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్, అలీఫ్లతో ఆరుణ్య బ్రాండ్కు విక్రయ ఒప్పందం కుదిర్చారు. సోమవారం నారాయణపేట మినీ స్టేడియంలో జరిగిన ప్రగతి సభలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ హరిచందన ట్విట్టర్లో ట్వీట్ చేయగా, అభినందనలు చెప్తూ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.