దుబాయ్: ఇండో పాక్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్ను తలపించింది. అయితే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో.. హర్షదీప్ కీలకమైన క్యాచ్ను జారవిడిచాడు. 18వ ఓవర్లో అసిఫ్ అలీ కొట్టిన షాట్తో బంతి గాలిలోకి ఎగిరింది. చాలా ఈజీగా పట్టాల్సిన క్యాచ్ను.. టెన్షన్లో హర్షదీప్ వదిలేశాడు. ఇక ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. మైదానంలో అతని రియాక్షన్ కెమెరాలకు చిక్కింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఆ గేమ్లో.. కీలక దశలో క్యాచ్ వదిలేయడంతో .. మ్యాచ్ పాకిస్థాన్ వశమైంది. కానీ హర్షదీప్ క్యాచ్ వదిలేయడం వల్ల అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆన్లైన్లో అతనిపై ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు సీనియర్లు మాత్రం హర్షదీప్కు అండగా నిలిచారు. వత్తిడి మ్యాచ్లో ఇలాంటి ఘటనలు సహజమే అని హర్భజన్ సింగ్ అన్నాడు. తన ట్విట్టర్లో భజ్జీ రియాక్ట్ అవుతూ.. కావాలని ఎవరూ క్యాచ్ను వదిలేయరని, యువ పేస్ బౌలర్ను నిందించడం సరికాదు అని అన్నాడు. భారత్ విసిరిన 182 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగా ఆ టార్గెట్ను పాక్ అందుకున్నది. పాక్ బ్యాటర్ రిజ్వాన్ 71 రన్స్ చేశాడు.
— Guess Karo (@KuchNahiUkhada) September 5, 2022
Stop criticising young @arshdeepsinghh No one drop the catch purposely..we are proud of our 🇮🇳 boys .. Pakistan played better.. shame on such people who r putting our own guys down by saying cheap things on this platform bout arsh and team.. Arsh is GOLD🇮🇳
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 4, 2022