రాజన్నసిరిసిల్ల : జిల్లా కేంద్రం గాంధీనగర్లోని హనుమాన్ ఆలయంలో పంచలోహ విగ్రహాల అపహరణ కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్కుమార్ గురువారం వివరాలు వెల్లడించారు. గత మార్చి 29న అర్ధరాత్రి ఆలయంలోని సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్, పాండురంగడు, రుక్మీణిదేవి విగ్రహాలను ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా గజ్వేల్కు చెందిన షకల్సింగ్ఖ హరిభజన్సింగ్ అలియాస్ భజ్జీని నిందితుడిగా గుర్తించారు.
అతడు ఎత్తుకెళ్లిన ఆరువిగ్రహాల్లో మూడింటిని పగులగొట్టి తెల్లవారి తంగళ్లపల్లికి చెందిన సర్వోజు బాలయ్యకు విక్రయించాడు. గజ్వేల్కు చెందిన హరిభజన్ సింగ్ అలియాస్ భజ్జీ (20) ను హనుమాన్ దేవాలయంలో ఆరు పంచలోహ విగ్రహాలను అపహరించుకుపోయాడని పేర్కొన్నారు.
ఆరు విగ్రహాల్లో మూడు విగ్రహాలను పగలగొట్టి, పగలగొట్టిన విగ్రహాలను మరుసటి రోజు తంగళ్లపల్లికి చెందిన సర్వోజు బాలయ్య వద్ద విక్రయించాడు.
గురువారం హరిభజన్సింగ్, బాలయ్యను అదుపులోనికి తీసుకుని, విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఎస్ఐ సుధాకర్, క్రైం పార్టీ కానిస్టేబుల్లు పుల్కం శ్రీనివాస్, నీలం జగదీశ్వర్ను సీఐ అనిల్కుమార్ అభినందించారు.
ఇవి కూడా చదవండి..
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్