జమ్మికుంట: దళితబంధుపై ఎవ్వరికీ అనుమానాలొద్దని, ప్రతి దళిత కుటుంబానికి పైసలు వస్తాయని ఎమ్మెల్యే అరూరి రమేశ్ భరోసా ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలంలోని వావిలాల, గోపాలపురం గ్రామాల్లో దళితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ..దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆగంకావొద్దని సూచించారు. ఈ ఉప ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలపించాలని కోరారు.