హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా ఆరోగ్యలక్ష్మి పథకంలో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్ ఆదేశించారు. విచారణాధికారిగా జాయింట్ డైరెక్టర్ కేఆర్పీ లక్ష్మీదేవిని నియమించారు. జగిత్యా ల జిల్లా ఆరోగ్యలక్ష్మి పథకం అమలులో నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి.
వీటిపై సమగ్ర విచారణ చేసి మూడునెలలలోపు నివేదిక అందజేయాలని ఆమె ఆదేశించారు. జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారిసహా ముగ్గురు సీడీపీవోలు (ఇందులో ఇద్దరు రిటైర్డ్ అధికారులు), సీనియర్ అసిస్టెంట్పై విచారణ చేయాలని పేర్కొన్నారు. విచారణ అధికారికి సహాయ అధికారిగా స్త్రీ, శిశు సంక్షేమశాఖ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ను నియమించారు.