సికింద్రాబాద్, జనవరి 22: కరోనా కట్టడిలో భాగంగా ముం దస్తు జాగ్రత్తగా రాష్ట్ర సర్కారు చేపట్టిన ఇంటింటికీ జ్వర సర్వే రెండో రోజు ముమ్మరంగా సాగింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో 48 బృందాలు గడపగడపకూ వెళ్లి జ్వర సర్వే చేశారు. శనివారం బల్దియా సిబ్బందితో పాటు ఆశ కార్యకర్తలు, ఎఎన్ఎంలు ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య వివరాలు సేకరించారు. సికింద్రాబాద్ సర్కిల్-29 పరిధిలో 23 బృందాలు సీతాఫల్మండి, మెట్టుగూడ, బౌద్ధనగర్, తార్నాక, అడ్డగుట్ట డివిజన్లలో నిర్వహించిన సర్వేలో స్థానిక కార్పొరేటర్లతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బౌద్ధనగర్లో కార్పొరేటర్ కంది శైలజ ఆరోగ్య సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. కరోనా లక్షణాలు ఉన్న 65 మందికి ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఆదే విధంగా కంటోన్మెంట్ పరిధిలోని ఎనిమిది వార్డుల్లో 25 బృందాలు సర్వే చేపట్టాయి. బోయిన్పల్లి, తిరుమలగిరి, పికెట్, బొల్లా రం, రసూల్పురా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నేతృత్వంలో 2,055 ఇండ్లలో ఫీవర్ సర్వే చేపట్టగా, 93 మందికి స్వల్ప లక్షణాలు గుర్తించి ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు.