హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీలో రాహుల్, భజన్కౌర్ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన బాలుర సబ్జూనియర్ రికర్వ్ విభాగంలో హర్యానా ఆర్చర్ రాహుల్ 6 పాయింట్లతో టాప్లో నిలువగా, కపీశ్సింగ్(రాజస్థాన్), అమిత్కుమార్(మధ్యప్రదేశ్) వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు.
బాలికల సబ్ జూనియర్ రికర్వ్ కేటగిరీలో హర్యానాకు చెందిన యువ ఆర్చర్ భజన్కౌర్ టైటిల్ దక్కించుకుంది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఇన్చార్జి ప్రెసిడెంట్ వేణుగోపాలచారి, కార్యదర్శి జగదీశ్యాదవ్, జాతీయ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ చందుర్కార్, రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.