హైదరాబాద్ : హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్కు ఆమోదం తెలపండి అంటూ సోమవారం లోక్ సభలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పత్రాలు అందజేయలేదన్న కేంద్ర ప్రభుత్వం వాదన తప్పు అన్నారు
. 2014లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
2014 సంవత్సరంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వివరణాత్మక మెమోరాండంను పంపించరన్నారని ఎంపీ తెలిపారు.
2016 సంవత్సరంలో ఐటీఐఆర్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించమన్నారు.
గడచిన 6 సంవత్సరాల్లో పలుమార్లు కేంద్ర ఐటీ&ఎలక్ట్రానిక్స్ శాఖకు సంప్రదించామని ఆయన పేర్కొన్నారు.
2021 జనవరిలో కూడా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఈ దఫా కేంద్ర బడ్జెట్ లో ఐటీఐఆర్ నిధులు కేటాయించాలని కోరారు.
తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరుతున్న.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఐటీఐఆర్ ప్రాజెక్టును ఆమోదించి, నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.
బదులుగా తెలంగాణలో ఐటీ అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించేందుకు ఒక పథకాన్ని రూపొందించాలని ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.