కొండాపూర్, నవంబర్ 25: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తురగ ఫౌండేషన్ (టీఎఫ్) సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫెలోషిప్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ విభాగం హెడ్ ప్రొఫెసర్ వాసుకీ బెలవడీ గురువారం తెలిపారు. ‘ది అఫ్టర్మ్యాథ్ ఆఫ్ ఏ పాండమిక్’ అంశంపై స్టోరీలు రూపొందించేందుకు నరేందర్ రేవల్లి మీడియా ఫెలోషిప్స్ -2021కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు https://snschool.uohyd.ac.in/comm/nr-media-fellowship/ వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అనంతరం టీఎఫ్ ట్రస్టీ శైలజ పిల్లలమర్రి, ఇతర ప్రతినిధులతో కలిసి ఫెలోషిప్ బ్రోచర్లను ఆవిష్కరించారు.