అమరావతి, జూన్ 25: ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర,యానాం, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఝార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు 1.5 కిమీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణిగా ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రా, యానాంలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో రేపటినుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు.