మచిలీపట్నం,జూన్ 20: రైతుకు సంబంధించి ప్రతి అవసరం స్థానిక రైతు భరోసా కేంద్రంలోనే లభించాలని, ఏ ఒక్క రైతు ఊరి పొలిమేర దాటకుండానే వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయమైనా పరిష్కారం కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృఢ సంకల్పమని ఏపీ రవాణాశాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్ లోఖరీఫ్ సాగు సమాయత్తంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రి పేర్నివెంకట్రామయ్య (నాని),రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రైతుల కోసం ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని, అందులో భాగంగా రైతు భరోసా క్రింద ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామని ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. జిప్సం,జింకు తదితర పోషకాలు మొదలుకొని విత్తనాలు ,ఎరువులు పురుగు మందులే కాకుండా ధాన్యం విక్రయించుకోవాలన్నా రైతుభరోసా కేంద్రమే రైతన్నకు దిక్సూచి కావాలన్నారుమంత్రి పేర్ని నాని.