హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం హైదరాబాద్లో సినీ నటుడు మోహన్బాబును కలిశారు. మోహన్ బాబు ఇంటికి వెళ్లి చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి చర్చించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో చిరంజీవి ప్రతినిధి బృందం భేటీ వివరాలను మోహన్బాబుకు మంత్రి నాని వివరించారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్తో భేటీపై చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్కు సినిమాపరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇస్తూ, చాలా సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ సినిమాపరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలో సినిమా పరిశ్రమ అధికారికంగా శుభవార్త వింటుందని ఆశిస్తున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.