హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): విశాఖపట్టణం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ రైలులోని ఎస్ 6 బోగీలో శుక్రవారం ఆకస్మాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్ సమీపంలో దాదాపు గంట పాటు రైలుని నిలిపివేశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. బ్రేకులు జాం కావడంతోనే పొగలు వచ్చాయని రైలును తనిఖీ చేసిన అధికారులు తెలిపారు.