అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం కేబినెట్ సమావేశ మందిరంలో మంత్రివర్గ భేటీ జరిగింది. సమావేశంలో 39 అంశాలపై కేబినెట్ చర్చించింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. అలాగే మైనారిటీ సబ్ ప్లాన్కు, ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమ తొలగించేందుకు.. ప్రమాద రహిత పరిశ్రమ నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్కు అనుమతి ఇచ్చింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నియామకం చట్ట సవరణకు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకితో కలిసి సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు, అలాగే ఆర్అండ్బీ ఖాళీ స్థలాలు, భవనాలు ఆర్టీసీకి బదలాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.