న్యూఢిల్లీ: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన టైలర్ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దర్జీ కన్హయ్యలాల్ను ఇద్దరు ఆగంతకులు కత్తితో దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల హస్తం ఉందా లేదా తేల్చేందుకు కేసును ఎన్ఐఏకు అప్పగించారు. విదేశీ కుట్ర కోణాన్ని కూడా ఆ దర్యాప్తు సంస్థ పరిశీలించనున్నది. దర్యాప్తు అంశంపై ఇవాళ కేంద్ర హోంశాఖ ఓ ట్వీట్ కూడా చేసింది. కన్హయ్యలాల్ హత్య నేపథ్యంలో ఉదయ్పూర్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. రాబోయే 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.
#WATCH | Rajasthan: Mortal remains of Kanhaiya Lal, who was killed yesterday by two men in Udaipur's Maldas street area, reach his native place in Udaipur pic.twitter.com/O7YYph9YK6
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 29, 2022