న్యూఢిల్లీ: యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ హెలీనాను ఇవాళ డీఆర్డీవో పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హెలికాప్టర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ పరీక్షలో పాల్గొన్నది. హై ఆల్టిట్యూడ్ పర్వత శ్రేణుల్లో ఈ పరీక్ష జరిగినట్లు డీఆర్డీవో తెలిపింది. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్హెచ్) ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. ట్యాంక్ను టార్గెట్ చేస్తూ మిస్సైల్ను ఫైర్ చేశారు. ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ ఆ క్షిపణిని గైడ్ చేయనున్నది.