తిరుపతి : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందిస్తున్న బర్డ్ ఆసుపత్రి(BIRRD Hospital) కు రూ.కోటి విలువచేసే అత్యాధునిక కృత్రిమ అవయవాల(Artificial organ machines ) తయారీ యంత్రాలను టీటీడీకి అందజేశారు. సేలంకు చెందిన దాత బాల సుబ్రమణ్యం బర్డ్ ఆసుపత్రిలో పూజలు నిర్వహించి బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డప్పరెడ్డికి అందజేశారు. దీనిని రోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకాధికారి కోరారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 9 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 64, 097 మంది భక్తులు దర్శించుకోగా 24,453 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.