శామీర్పేట, ఫిబ్రవరి 14: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువ క్రికెటర్. మారుమూల ప్రాంతంలో పుట్టినా..క్రికెట్పై మక్కువతో కష్టపడి పైకి ఎదిగాడు. అంచలంచెలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ తాజాగా ఐపీఎల్ వేలంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సొంతమయ్యాడు. అతడే మూడుచింతల పల్లి మండలం అనంతారం గ్రామానికి చెందిన బుద్ది రవీందర్ కొడుకు బుద్ది రాహుల్. హైదరాబాద్ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఈ 24 ఏండ్ల యువ క్రికెటర్ ప్రతిభకు గుర్తింపు దక్కింది. లెఫ్ట్హ్యాండ్ బ్యాటింగ్కు తోడు ఉపయుక్తమైన స్పిన్తో జట్టుకు విజయాలందిస్తున్న రాహుల్ను ముంబై 20 లక్షలకు వేలంలో కొనుగోలు చేసింది. ఐపీఎల్కు ఎంపిక కావడంపై రాహుల్ తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.