అమరావతి, జూలై : కరోనా మందుపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో తాను మందు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నానని, కొందరు మాత్రం తన పేరుతో నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నారని ఆనందయ్య ఆరోపించారు. తన పేరుపై తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే అందుకు తాను బాధ్యుడ్ని కానని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ నకిలీ మందుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆనందయ్య సందర్శించారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఆనందయ్యం. ఆ తర్వాత పలువురికి కరోనా నివారణ మందు అందజేశారు.