తుమకూరు, జనవరి 30: కర్ణాటకలో మహీంద్రా షోరూంకు వెళ్లి అవమానించబడి వార్తల్లో నిలిచిన రైతు కెంపెగౌడకు సదరు కంపెనీ బొలెరో వాహనాన్ని ఇంటివద్దకే డెలివరీ చేసింది. షోరూం సిబ్బంది అవమానించినందుకు కెంపెగౌడకు క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేసింది. మహీంద్రా గ్రూప్ హెడ్ ఆనంద్ మహీంద్ర దీన్ని రీట్వీట్ చేశారు. ‘కెంపెగౌడ గారు మీకు స్వాగతం’ అని పేర్కొన్నారు. కంపెనీ ‘సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, సిబ్బంది శుక్రవారం ఉదయం మా ఇంటికి వచ్చారు. క్షమాపణలు చెప్పారు. వాహనాన్ని కొనడానికి రావాలని కోరారు. సాయంత్రం ఇంటికే డెలివరీ చేశారు’ అని కెంపెగౌడ చెప్పారు. ఈ నెల 21న షోరూంకు వెళ్లిన కెంపెగౌడను మహీంద్రా షోరూం సిబ్బంది అవమానించారు. డబ్బులున్నాయా.. అంటూ హేళన చేశారు. దీంతో కెంపెగౌడ ఇంట్లో నుంచి రూ.10 లక్షలు తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపర్చారు.