నల్లమల అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ నల్లమల పెద్దపులుల అభయారణ్యంలోని అందాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఈ నెల 15 నుంచి ఈ ప్యాకేజీ ప్రాంభమవుతున్నది. ప్రస్తుతం రోజుకు 12 మందిని అనుమతిస్తారు. ఇందుకోసం పర్యాటకులు ఆన్లైన్లో amrabadtigerreserve.com వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మూడు రకాల ప్యాకేజీలు ఉన్నాయి. మొదటి ప్యాకేజీ కింద ఇద్దరికి ఏసీ గదిలో రెండు పడకల కాటేజీలో బసకు రూ.4,600, రెండోది రూ.7 వేలతో నలుగురికి, మూడోది రూ.9,200తో ఆరుగురికి అవకాశం ఉంటుంది. టిఫిన్లు, నీళ్లు, ఆహారానికి ప్రత్యేకంగా చార్జీలు ఉంటాయి.