పాట్నా: బీహార్లో ఒకవైపు పొలిటికల్ టెన్షన్ నెలకొని ఉంటే.. మరో వైపు ఆ రాష్ట్ర స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాకు కరోనా వైరస్ సంక్రమించింది. జేడీయూ, బీజేపీ బంధానికి బ్రేక్ పడే సమయంలో స్పీకరే కీలకంగా మారనున్నారు. అయితే పాజిటివ్ వచ్చిన ఒక్క రోజు తేడాలోనే స్పీకర్ విజయ్ కుమార్ కరోనా పరీక్షలో మళ్లీ నెగటివ్ తేలారు. విజయ్ కుమార్ సిన్హా .. బీజేపీ ఎమ్మెల్యే. సోమవారం ఆయన తన ట్విట్టర్లో కరోనా రిపోర్ట్ను వెల్లడించారు. స్పీకర్ ఇంత వేగంగా ఎలా కోవిడ్ నెగటివ్ వచ్చారని సోషల్ మీడియాలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇక బీహార్లో ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా బీజేపీ నేత మంగల్ పాండే ఉన్నారు. సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా చేయకపోవచ్చు, కానీ ఒకవేళ బలం నిరూపించుకోవాలంటే బీజేపీ పార్టీకి చెందిన స్పీకర్ కీలకంగా మారనున్నారు. ఒకవేళ సిన్హా గైర్హాజర్ అయితే, అప్పుడు జేడీయూ నేత హజారీ స్పీకర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ సమయంలో నితీశ్కు ఈజీగా లైన్ క్లియర్ అవుతుంది. నితీశ్ ఒకవేళ మహాఘట్బంధనతో వెళ్లాలనుకుంటే, ఆయనకు సంఖ్యా బలంతో సమస్య ఉండదు.