
వాషింగ్టన్: తాలిబన్ల పాలనలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న అఫ్గాన్లను ఆదుకోవడానికి అమెరికా భారీ ఆర్థికసాయాన్ని ప్రకటించింది. మానవతా ధృక్పథంతో దాదాపు రూ.1,080 కోట్లను అందజేయనున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ చెప్పారు. ఈ నిధులను అఫ్గాన్ ప్రభుత్వానికి ఇవ్వమని, సేవా కార్యక్రమాలు నిర్వహించే ఐక్యరాజ్యసమితిలాంటి సంస్థలకు ఇస్తామని తెలిపారు. తద్వారా ఈ నిధులు నేరుగా ప్రజలకు చేరుతాయని, వారి జీవితాలు బాగుపడుతాయని పేర్కొన్నారు.