తిరుమల : తిరుమలలోని అన్ని ఉద్యానవనాలకు కొత్త శోభను తీసుకువస్తాతమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రీన్ కార్పెట్, ఎవె న్యూ ప్లాంటేషన్, సీజనల్ ఫ్లవర్స్, 1500 వేలాడే కుండీలను ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ స్థలంలో 15 అడుగుల కృష్ణ విగ్రహం, 20 అడుగుల పాలరాతి గోవింద నామం, శంకు, చక్ర చిహ్నాలు, వేంకటేశ్వర పాదాలు, తెల్ల గులాబీలు, మూడు జతల గోమాత, దూడ ఉన్నాయని చైర్మన్ తెలిపారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరం ఉండాలనే లక్ష్యంతో ఉద్యానవనాల ను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 27న ఏపీ సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అదేరోజు సీఎం చేతులమీదుగా తిరుమలలో నూతన పరకామణి భవనాన్ని ప్రారంభిస్తారని అన్నారు. 2023లో తిరుపతిలో శ్రీనివాస సేతు నిర్మాణ పనులు ఏడాది ఆఖరికల్లా పూర్తి చేస్తామని చైర్మన్ వివరించారు.
,