హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 9.30 గంటలకు వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్ హోదాలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్య అతిథిగా డీఆర్డీవో చైర్మెన్, కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ జీ సతీశ్రెడ్డి హాజరుకానున్నారు.
ఈ వేడుకల్లో 2018-2019, 2019-2020 విద్యాసంవత్సరాలకు సంబంధించిన 80 మంది విద్యార్థులు స్వర్ణ పతకాలు, 350 మంది విద్యార్థులకు ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో స్వర్ణ పతకాలు సాధించిన 22 మందికి వారి వారి కళాశాలలకు పతకాలను పంపిస్తారు.