‘శతమానం భవతి’ ‘శ్రీనివాస కల్యాణం’ వంటి సినిమాల ద్వారా కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సతీష్ వేగేశ్న. తాజాగా ఆయన ఓటీటీలో అరంగేట్రం చేశారు. పల్లెటూరి కథలతో కూడిన ఓ వెబ్సిరీస్ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్కు ‘కథలు (మీవి..మావి’) అనే టైటిల్ను నిర్ణయించారు. ‘ఇప్పటికే మూడు కథల తాలూకు చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మిగతా వాటిని పూర్తిచేస్తాం. ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎలాంటి అసభ్యతకు తావులేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సిరిస్ను తీర్చిదిద్దుతున్నాం. ఇందులో నటించే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని వేగేశ్న సతీష్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘కోతి కొమ్మచ్చి’ ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’ అనే చిత్రాల్ని చేస్తున్నారు.