ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 3 : అటవీ శాఖ పరిధిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్లో అన్ని రకాల మొక్కలు పెంచాలని డీఎఫ్వో రాజశేఖర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి రేంజ్ పరిధిలోని బుర్సన్పటార్ అటవీ శాఖ ప్లాంటేషన్ను శనివారం ఆయన సందర్శించారు. ప్లాంటేషన్లో నాటిన మొక్కలను పరిశీలించి వాటి ఎదుగుదలపై ఆరా తీశారు. నాటిన మొక్కల వివరాలు, నమోదు చేసిన రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ శాఖకు చెందిన భూముల్లో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆడవుల్లో గుర్తించిన ఖాళీ స్థలంలో కూడా మొక్కలు నాటాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో పాండునాయక్, ఎఫ్ఎస్వో నర్సయ్య, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.