అశ్వారావుపేట, డిసెంబర్ 23: ఓటరుగా నమోదుకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కోరారు. బీఎల్వోలు ఇటీవల స్వీకరించిన ఓటు దరఖాస్తులను శుక్రవారం మండలంలోని మొద్దులమడ, మామిళ్ళవారిగూడెం, ఆసుపాక, గుంటిమడుగు, కొత్తూరు, వినాయకపు రం, అశ్వారావుపేట గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఓటు ప్రాధాన్యాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. ఏఎస్ఆర్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల స్థాయిని పరిశీలించారు. తహసీల్దార్ చల్లా ప్రసాద్, గిర్దావర్లు కృష్ణ, పద్మావతి, యూడీసీ లావణ్య పాల్గొన్నారు.