కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’. కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది. రెండేళ్లుగా ముచ్చెమటలు పట్టిస్తున్న కొవిడ్ మళ్లీ రూపం మార్చుకుని దాడి చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 82 శాతం మందికి టీకాలు వేసింది. 302 గ్రామాల్లో వంద శాతం పూర్తి చేసింది. టీకాలపై అపోహలు ఉన్న వారికి అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ వేస్తున్నది. పద్దెనిమిదేళ్ల పైబడిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేసేలా, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రస్తుత సిబ్బందితోపాటు మరికొంత మందిని రంగంలోకి దింపేందుకు కార్యాచరణ రూపొందించింది.
వరంగల్, నవంబర్ 29(నమస్తేతెలంగాణ): ప్రభు త్వ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరో నా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సి నేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. జిల్లా లో ఇప్పటికే 82 శాతం మందికి టీకా ఇచ్చారు. 302 గ్రామాల్లో వంద శాతం పూర్తి చేశారు. ప్రజల ఆరోగ్యా ని కి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం పద్దెనిమి దేం డ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా ఇచ్చేందుకు స్పెష ల్ డ్రైవ్ చేపట్టింది. గత సెప్టెంబర్ 16 నుంచి ఈ కా ర్యక్రమం అమల్లోకి వచ్చింది. వైద్య ఆరోగ్యశాఖలో ని అధికారులు, సిబ్బంది మొదట ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల స్థాయిలో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ విస్తృతం చేశారు. ప్రస్తుతం ఇం టింటికి వెళ్తున్నారు. కరోనా టీకాపై అపోహలతో వ్యా క్సినేషన్కు ముందుకు రాని వారికి టీకాపై అవగా హన కల్పిస్తున్నారు. వారికి నచ్చజెప్పి వ్యాక్సినేషన్ చేస్తున్నా రు. ఈ క్రమంలో వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, కూలీలకు పొలం వద్దే టీకా ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగం పెంచేందుకు అంగన్వాడీ కార్యకర్తల సేవలను కూడా తీసుకోవాలనే ప్రతిపాదన తాజాగా తెరపైకి రాగా, ప్రభుత్వం పరిశీలిస్తున్నది. కరోనాను క ట్టడి చేసేందుకు గతంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు అంగన్వాడీ కార్యకర్తలు విధులు నిర్వర్తించారు.
జిల్లాలో ప్రతి రోజూ సుమారు ఐదు వేల మందికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కరోనా టీకా ఇస్తున్నారు. సోమవారం వరకు జిల్లాలో కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 3,16,726కు చేరినట్లు జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి వెంకటరమణ ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. వీరిలో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 2,05, 089, సెకండ్ డోస్ తీసుకున్న వారు 1,11,637 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. సోమ వారం వరకు జిల్లాలో వ్యాక్సినేషన్ నిర్దేశిత లక్ష్యంలో 82 శాతం పూ ర్తయినట్లు వెంకటరమణ వెల్లడించారు. డిసెంబర్ నెలా ఖరులోగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలని ప్రభు త్వం లక్ష్యం నిర్దేశించగా ఆ లోపే అధిగమిస్తామని చె ప్పారు. కొద్ది రోజుల నుంచి ఈ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు రెండు మూడు రోజులకోసారి టీకా ప్రక్రియపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష జరు పుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమా ర్తోపాటు హెల్త్ డైరెక్టర్, కలెక్టర్ ప్రతి రోజూ జిల్లాలో వ్యాక్సినేషన్ వివరాలను తెలుసుకుంటున్నారు.
సోమవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ అధ్యక్ష తన జరిగిన క్యాబినెట్ సమావేశంలో వైరస్ కొత్త వేరి యంట్ ఒమిక్రాన్ను సమర్థవంతంగా ఎదు ర్కొనేందు కు, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం సబ్ కమిటీని నియమిం చింది. మంత్రి హరీశ్రావు నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు పంచా యతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సభ్యు లుగా ఉన్నారు. మంత్రులు వారి వారి జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష సమావేశాలు నిర్వహిం చాలని సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో చెప్పా రు. ఒమిక్రాన్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్వో వెంకట రమణ సోమవారం వరంగల్లోని తన కార్యాలయం లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై కరో నా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయ డంపై చర్చించారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి తోడు అదనంగా మరికొందరిని రంగంలోకి దింపేందుకు ప్రణాళిక తయారు చేశారు.