స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో బాగా పరిచయమే. ఆమె ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ అకడ పాపులర్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్లో ఆమె పోషించిన రాజీ పాత్రకు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అగ్ర హీరోలతో వరుస చిత్రాల్లో నటించిన సమంత దక్షిణాది దాటి బయట అడుగుపెట్టలేదు. గతంలో వచ్చిన బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయలేకపోయింది సామ్. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా..’ పాటతో మరోసారి బాలీవుడ్ ను ఆకర్షించిన సమంత…ఓ భారీ ప్రాజెక్ట్లో నాయికగా ఎంపికైనట్లు తెలుస్తున్నది. అక్షయ్ కుమార్ హీరోగా దర్శకుడు కుమార్ మాంగత్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత బాగుంటుందని సంప్రదింపులు చేస్తున్నారట చిత్రబృందం. ప్రస్తుతం సమంత తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నది. దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న ఇతిహాసిక చిత్రం ‘శాకుంతలం’తో పాటు ‘యశోద’ అనే మరో నాయిక ప్రధాన చిత్రంలో కనిపించనుంది. ఈ రెండు వేటికవి భిన్నమైన చిత్రాలు కావడం విశేషం. ఈ చిత్రాల షూటింగ్ పూర్తి చేసి బాలీవుడ్ చిత్రానికి డేట్స్ ఇవ్వనుందట సమంత.